Wednesday, May 15, 2024

TS: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

నారాయణపేట: ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన నారాయణపేట జిల్లాలోలో జరిగింది. జిల్లాలోని మక్తల్‌ మండలం బొందలకుంట రోడ్డుపై గుర్తుతెలియని వాహనం డీసీఎంను ఢీకొట్టింది.

దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement