Monday, April 29, 2024

TS: ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగం.. జ‌గ‌దీష్ రెడ్డి

ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయింంద‌ని మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కె.పి వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ… నీళ్ళను ఎలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలమైంద‌న్నారు. కేసీఆర్ ను నమ్ముకొని పంటలు పెట్టాము, నీళ్ళు ఉండి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని భాద పడుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో చెక్ డ్యామ్ లు నిర్మించి కాళేశ్వరం నీళ్ళను అందించామన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాధాన్యతను గుర్తించి కేంద్రంతో మాట్లాడి, మహారాష్ట్రను ఒప్పించి నిర్మించారన్నారు.
కేసీఆర్ ఇప్పుడు ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండనిచ్చే వారు కాదన్నారు. కేసీఆర్ కరీంనగర్ వస్తున్నాడని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్ళను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారని సోయి కూడా లేదు, ఆయన మూటలతో ఢిల్లీకీ పోవడమే సరిపోతోందన్నారు.
ప్రతిదానికి నోరు పారేసుకొని కేసీఆర్ పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. భ‌ట్టి విక్రమార్కకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికీ ఎన్నడూ భాద్యత తెలియదు, రైతుల గురించి తెలియదన్నారు. పత్రికలలో లీక్ లు ఇచ్చి పెద్ద పెద్దగా రాపించి బ్రతుకుదామని అనుకుంటున్నారన్నారు. తెలంగాణ రాక ముందు ఇంతకంటే ఎక్కువ కుట్రలు చేసి పెద్ద పెద్దగా వార్తలు రాశారన్నారు. అయినా పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కేసీఆర్ ఉంటే ఇంత భాధ ఉండకపోతుండే అని రైతులు బాధ‌పడుతున్నారన్నారు. ఒక వైపు కరువు పరిస్థితులు వస్తున్నాయి… సాగునీరు, తాగునీరు ఎలా ఇవ్వాలో సోయి లేకుండా ఉన్నారన్నారు.

గత 15రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పొలాల్లో రైతుల దగ్గరకు వెళ్ళిందన్నారు. పంట నష్టం అంచనా వేసి ఈరోజు సిఎస్ కు వినతిపత్రం ఇచ్చామన్నారు. 100 రోజుల్లోనే 2014 కంటే ముందు పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు జోలే పట్టుకొని ఎలానైతే కేసీఆర్ తిరిగారో, ఇప్పుడు రైతులకు దైర్యం చెప్పేందుకు రైతుల దగ్గరకు కేసీఆర్ వెళ్తున్నాడన్నారు. రైతు బంధు, రూ2 లక్షల రుణ మాఫీ వెంటనే అమలు చెయ్యాలన్నారు. ఎన్నికల కోడ్ ఉందని ఆగొద్దు.. మేము ఎక్కడా ఈసీకి ఎటువంటి ఫిర్యాదులు చెయ్యమ‌న్నారు. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు… వెంటనే క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చి వడ్లు, మొక్కజొన్నలు కొనాలన్నారు. నష్ట పోయిన రైతాంగానికి వెంటనే ఎకరాకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement