Monday, April 29, 2024

TS : పోస్ట్ కార్డుల ఉద్య‌మానికి రైత‌న్న‌లు శ్రీకారం..

సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ లో, చిన్నకోడూర్ మండలం మార్కెట్ యార్డ్ లో రైతులు స్వచ్చందంగా సిఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు రాశారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు హామీలు అమలు చేయక పోవడంతో రైతులు ఆవేదన చెందారు. పోస్ట్ కార్డు ద్వారా తమ ఆవేదనను సిఎం రేవంత్ కు పంపారు..

రైతులకు ఇచ్చిన హామీలు…
వరి ధాన్యానికి ఇస్తానన్న బోనస్ 500
రైతు భరోసా 10,000లకి బదులు 15000 రూపాయలు
రైతు కూలీలకు ఇస్తానన్న 12000
రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు
అంద‌రికీ రైతు భీమా
వర్షాలు రాక ఎండిపోయిన పంటలకు నష్టపరిహారంగా రూ. 25000

వెంటనే అమలు చేసి రైతు సోదరులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులు రాసి పంపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఎంపి ఎన్నికల్లో తమ ఓటుతో గుణపాఠం చెపుతాం అని హెచ్చరించారు. రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మద్దతు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement