Tuesday, May 7, 2024

విద్యుద్ఘాతంతో రైతు మృతి

కొత్తగూడ, (ప్రభ న్యూస్) : ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తగూడ మండలంలోని దుర్గారం గ్రామపంచాయితీ పరిధిలో గల అమృతండా గ్రామానికి చెందిన భూక్య సుమన్ (30) అనే రైతు ఈరోజు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. సుమన్ భార్య వరలక్ష్మి, కూతురు అక్షర (08) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి రోజు లాగే ఈరోజు కూడా భూక్య సుమన్ తను పండించే మిరప తోటకు నీరు పెట్టేందుకు మోటారు వేసే క్రమంలో విద్యుద్ఘానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement