Wednesday, May 1, 2024

MDK: ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య

కౌడిపల్లి, సెప్టెంబర్ 2, ప్రభ న్యూస్ : ఉరివేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే… దేవులపల్లి గ్రామానికి చెందిన తలారి అంజయ్య (42) శుక్రవారం రాత్రి వరకు కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. శనివారం ఉదయం ఇంటి పక్క వారు చూసేసరికి తన పాత ఇంటి వద్ద దూలానికి ఉరివేసుకొని మృతి చెందాడు.

తలారి అంజయ్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు అంజయ్యకు భార్య లింగమని, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కౌడిపల్లి పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement