Friday, May 3, 2024

Fake Currency – దొంగ నోట్ల ముఠా అరెస్ట్..రూ.60 లక్ష‌ల విలువైన న‌కిలీ నోట్లు స్వాధీనం…

హైద‌రాబాద్ – భాగ్య‌న‌గ‌రంలో దొంగ నోట్ల చెలామ‌ని గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు.. న‌గ‌రంలోని ర‌ద్దీగా ఉన్న షాపింగ్ మాల్స్ లోనూ, బార్ లు, వైన్ షాపుల‌లోనూ ఇటీవ‌ల కొంద‌రు వ్య‌క్తులు అయిదు వంద‌ల నోట్ల‌ను ఇస్తూ త‌మ‌కు కావాల‌సిన వ‌స్తువులను తెచ్చుకుంటున్నారు.. ఆయా షాపుల య‌జ‌మానులు ఆ న‌గ‌దును బ్యాంక్ డిపాజిట్స్ చేస్తున్న సంద‌ర్భంలో అవి దొంగ‌నోట్లు అని తేల‌డంతో ల‌బోదిబోమంటున్నారు.. ఈ దొంగ‌నోట్ల వ్య‌వ‌హారంపై ప‌లువురు వ్యాపారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో నేడు ఎల్బీనగర్‌లో నోట్ల చెలామ‌ని చేస్తున్న ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.60 లక్షల నకిలీ నోట్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే డ్రగ్స్ విక్రయిస్తున్న మరో ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు సభ్యుల ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 30 గ్రాముల ఎండీఎంఏ, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement