Tuesday, July 23, 2024

Fake Call – నాంప‌ల్లి కోర్టుకు బాంబ్ కాల్ ..

బాంబు బెదిరింపు కాల్స్‌ హైదరాబాద్‌ నగరంలో కలకలం సృష్టించాయి. మధ్యాహ్నం ప్రజాభవన్‌లో బాంబు పెట్టినట్లుగా పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పాడు. దాంతో అప్రమత్తమైన ప్రజాభవన్‌కు చేరుకొని విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఫేక్‌ కాల్‌పై పోలీసులు దృష్టి సారించి నిందితుడి కోసం ఆరా తీస్తుండగా నాంపల్లి కోర్టుకు సైతం బెదిరింపు కాల్‌ వచ్చింది. నాంప‌ల్లి కోర్టులో బాంబు పెట్టామని.. కొద్దిసేపట్లోనే పేల్చివేయనున్నట్లు అగతంకుడు పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే కోర్టు ప్రాంగణానికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఇది కూడా ఫేక్‌ కాల్‌గా గుర్తించారు. పోలీసులు ఫేక్‌ కాల్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఫోన్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement