Tuesday, May 14, 2024

యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి – యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శనివారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి , ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలు చొప్పున స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సంధర్బంగా ప్రపంచ చరిత్రలోనే యాదాద్రి ఆలయం చిరస్థాయిగా నిలిచిపోనున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మిక కేంద్రంగా తిర్చిదిద్దిన సీఎం కేసీఆర్ భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement