Sunday, May 5, 2024

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి సూచన

రాష్ట్రంలోని పలు చోట్ల కురుస్తున్న అకాల వర్షాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులతో తాజా పరిస్థితులను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అనుకోని విధంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఆయా చోట్ల ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. అలాగే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేసి, అవసరమైతే రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ప్రస్తుత వాతావరణానికి తగ్గట్లుగా వ్యవహరించాలని కోరారు. పెద్దలు, పిల్లలను బయటకు రానివ్వవద్దని సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement