Saturday, April 27, 2024

రంగారెడ్డి జిల్లా బిజెపి అధికార ప్రతినిధిగా ఎలిమినేటి జంగారెడ్డి


రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంత బీజేపీ అధికార ప్రతినిధిగా కొత్తపేట డివిజన్ కు చెందిన సీనియర్ నాయకుడు ఎలిమినేటి జంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అందించిన నియామక పత్రాన్ని శుక్రవారం కార్పొరేటర్లు వంగా మధుసూదన్ రెడ్డి, ఎన్. పవన్ కుమార్ చేతుల మీదుగా జంగారెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా అర్బన్ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతానని ఆయన తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఎల్బీనగర్ పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వగ్గుల సుందర్ నారాయణ, దాసరి జయప్రకాష్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement