Wednesday, May 15, 2024

Election campaign – తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బిజెపికి ఓటు వేయండి – కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్

చౌటుప్పల్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) : ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ పిలుపు నిచ్చారు. మునుగోడు అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి గురువారం చౌటుప్పల్ మండలం నుండి కేంద్ర మంత్రులతోపాటు వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, వెంటరాగా నియోజకవర్గంలోని వివిధ మండలాల మీదుగా ర్యాలీగా చండూరు చేరుకుని మంత్రి, నాయకులతో కలిసి వెళ్లి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ముందుగా చౌటుప్పల్ కు వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ కు చలమల్ల కృష్ణారెడ్డి ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు. కేంద్ర మంత్రి శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణారెడ్డి తన తల్లి పాదాలకు నమస్కరించి వెళ్లి నామినేషన్ వేశారు

. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనురాగ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని, అవినీతి కుంభకోణాలలో కూరుకు పోయారన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప ప్రజలు ఎవరు కూడా అభివృద్ధి చెందలేదని, అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు బీఆర్ఎస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల గురించి పట్టించుకోలేదని, అందువల్లనే ప్రజలు కూడా కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం బిజెపిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ కోరారు.

చలమల్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత బిడ్డగా ప్రజా సమస్యల పరిష్కారం నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి వచ్చానని, నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, మీకు అన్నివేళలలో అందుబాటులో ఉండి నిస్వార్ధంగా సేవ చేస్తానని తెలిపారు.

- Advertisement -

. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనూరు వీరారెడ్డి, పార్టీ అసెంబ్లీ కన్వీనర్ దూడెల భిక్షం గౌడ్, నాయకులు చలమల్ల నరసింహారెడ్డి, ఆలే చిరంజీవి, యాస అమరేందర్ రెడ్డి, రమణ గోని శంకర్, గుజ్జుల సురేందర్ రెడ్డి, రిక్కల సుధాకర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, కాయితి రమేష్ గౌడ్, బాతరాజు సత్యం, గోవర్ధన్ రెడ్డి అరవింద్ రెడ్డి తదితర నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement