Monday, April 29, 2024

వానల ఎఫెక్ట్… హైదరాబాద్ లో MMTS రైళ్ల రద్దు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో వర్షాలు భయంకరంగా కురుస్తున్నాయి. వానల ప్రభావంతో హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. భారీ వర్షాలు వస్తుండటంతో లింగపల్లి-హైదరాబాద్‌ మధ్య ఎంఎంటీఎస్‌ రాకపోకలను నిలిపివేసింది. ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తంగా 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దుచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement