Tuesday, April 30, 2024

Seized – శంషాబాద్ విమానాశ్రయంలో 41 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ విదేశీ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ. 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు

నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు.హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్‌లో దాచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అక్రమంగా బంగారం, డ్రగ్స్ తరలిస్తున్న క్రమంలో విమానాశ్రయాల్లో తనిఖీలను కట్టుదిట్టం చేశారు అధికారులు..

బెంగళూరులో రూ. 26 కోట్ల కొకైన్ సీజ్

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలిస్తున్న 2.6 కిలోల కొకైన్‌ను కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తీసుకెళుతున్న కెన్యా దేశానికి చెందిన 36 ఏళ్ల ఓ మహిళను అరెస్ట్ చేశారు. అధికారులకు సమాచారం అందడంతో విమానాశ్రయంలో తనిఖీలు చేసి పట్టుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement