Tuesday, April 30, 2024

TS: తాగితే మ‌నిషి కాదు.. అందుకే చంపేశా..

దుగ్గొండి, ప్రభ న్యూస్: నిత్యం వేధింపులకు పాల్పడుతున్న భర్తను క్షణికావేశంలో భార్య చంపేసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లిలో శనివారం చోటుచేసుకుంది. మైసంపల్లి గ్రామానికి చెందిన జేరిపోతుల రాజు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో తరుచూ గొడవ ప‌డుతూ ఉండేవాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో కోపోద్రిక్తురాలైన అత‌ని భార్య భ‌ర్త‌పై ప్రతి దాడి చేసింది. భ‌ర్త రాజును సిమెంట్ ఇటుకతో దాడికి పాల్ప‌డింది. దీంతో అత‌ను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న దుగ్గొండి సీఐ శ్రీనివాస్, ఎస్సై పరమేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేప‌ట్టారు. తానే హత్య చేసినట్లు రాజు భార్య పోలీసులకు లొంగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement