Friday, May 3, 2024

Dogs terror – గోనుపాడులో ఆరుగురు పై పిచ్చికుక్కల దాడి … ఆరుగురికి తీవ్ర గాయాలు

గద్వాల (ప్రతినిధి)అక్టోబర్ 19 (ప్రభ న్యూస్)జోగులాంబ గద్వాల జిల్లా:గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఆరుగురు పై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ ఆరుగురిలో పెద్దలు చిన్నారులు ఉన్నారు. గ్రామంలో గత రెండు రోజుల నుంచి పిచ్చికుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవాలని చిన్నారులపై కుక్కలు దాడులు చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయని గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈరోజు ఉదయం ఇంటి ముందర ఉన్న చోటనే చిన్నారి, కిషోర్, రాజు, పావని, దేవేందర్, మహబూబ్ ఈ ఆరుగురు పై కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలు అయ్యాయని ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గ్రామంలో పిచ్చికుక్కల దాడులను నివారించాలని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు గోనుపాడు శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement