Sunday, May 19, 2024

జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య..

నిజాంపేట, జులై18 (ప్రభ న్యూస్) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గెరిగంటి శ్రీకాంత్ (33) ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

అతని కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్థాపం గురై తాళ్లపల్లి గ్రామ శివారులో గల అతని వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే శ్రీకాంత్ మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement