Sunday, April 28, 2024

తెలంగాణ బిడ్డకు అవ‌మానం.. ప్రధానికి వంట కోసం పిలిచి నో ఎంట్రీ అన్న బీజేపీ

బీజేపీతో ఎట్ల ఉంటదో మరోసారి తెలిసి వ‌చ్చింది. ప్రధాని మోదీకి తెలంగాణ వంటల రుచులు చూపించాల‌ని పిలిచి ఓ మ‌హిళ‌ను అవమానించారు. కరీంనగర్ కు చెందిన యాదమ్మను ప్రధానికి వంట చేయాల‌ని ఆహ్వానించారు. కానీ, తీరా తనను లోపలికి కూడా రానివ్వకుండా అడ్డుకున్నార‌ని ఆమె వాపోయింది. దీంతో చేసేదేమీ లేక యాదమ్మ రోడ్డుమీదే ఉండిపోయింది.

ముందుగా పాస్ లేద‌ని పోలీసులు లోపలికి పంపిచలేదు. ఆ తర్వాత పాస్ లు తెచ్చుకున్నప్పటికీ వెహికల్ లేదంటూ వారిని అక్కడే నిలిపివేశారు. ప్రధానికి తెలంగాణ ఆడబిడ్డతో వంటలు చేయించి రుచి చూపిస్తామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ, ఇవన్నీ ప్రచార అర్భాటమేనని తేలిపోయింది. యాదమ్మను అవమానించి కనీసం ఆమెకు సభ స్థలానికి కూడా పంపించలేదు. దీంతో బీజేపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement