Monday, May 6, 2024

సిరి మిల్క్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఔట్ బ్లాక్-ఏ రోడ్ నెంబర్-10 వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిరి మిల్క్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని 27, 29వ డివిజన్ కార్పొరేటర్లు జ్యోతి నర్సింహా రెడ్డి, బొర్రా దేవి చందుల‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ను, కార్పొరేటర్, సీనియర్ నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బండారి లేఔట్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి, 27వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ రవీంద్ర బాబు, నాయకులు పి.వెంకటేశ్వరరావు, యజమానురాలు శ్రీదేవి, కాలనీ వాసులు గోపాల కృష్ణ,లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement