Friday, May 10, 2024

TS: మల్లు అనంతరాములుకు డిప్యూటీ సీఎం భట్టి నివాళులు

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ, విద్యుత్తు ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, సతీమణి నందిని విక్రమార్కలు మల్లు అనంతరాములుకు నివాళులర్పించారు. ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్థానాల లక్ష్మీపురం గ్రామంలో దివంగత పీసీసీ అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు మల్లు అనంతరాములు వర్ధంతి సందర్భంగా వారి వ్యవసాయ క్షేత్రంలో మల్లు అనంత రాములుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement