Saturday, May 18, 2024

Delhi – సోనియా, ఖర్గే లతో రేవంత్ భేటి

New Delhi – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీతో సమావేశం అయ్యారు.పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ఆమెతో చర్చించినట్టు సమాచారం. అలాగే ప్రధాని మోడీతో భేటీ గురించి సోనియా గాంధీకి వివరించనున్నట్టు సమాచారం

అలాగే సోనియాతో భేటీ అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. ఈ సందర్బంగా ఆయనతో సమావేశం సీఎం, డిప్యూటీ సీఎం భట్టి పలు కీలక అంశాలను చర్చించారు.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలపై ఆయనతో మాట్లాడినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement