Saturday, April 27, 2024

గ్రామాల్లోకి బీజేపీ వాళ్లు వస్తే.. తోకలు కత్తిరించండి.. మంత్రి హరీశ్ రావు

గ్రామాల్లో బీజేపీ వాళ్లు తిరిగితే వాళ్ల తోకలు కత్తిరించండని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్రం వడ్లు కొనమంటే.. నూకలు బొక్కండని అవహేళన చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్నీ ఉచితంగా పంచుతుంటే.. కేంద్రం అన్నీ పెంచుతుందన్నారు. కేంద్రం పేదప్రజలకు ఉపయోగపడే పనులేమీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేస్తుంటే చూస్తూ ఉండలేక అడ్డుకోవాలని చూస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement