Monday, May 6, 2024

TS : పంట‌పొలాల్లో మొస‌లి…పరుగు తీసిన రైతులు

న‌దుల్లో ఉండే మొస‌లి జ‌న‌వాసాల‌కు వ‌చ్చిన ఘ‌ట‌న‌లు చూశాం… కానీ పంట చేనుల్లో ద‌ర్శ‌నిమిచ్చిన మొస‌లిని మీరేప్పుడైనా చూశారా… అలాంటి ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లాలో జ‌రిగింది. నాగార్జున‌సాగ‌ర్ ప‌రిధిలోని మండ‌ల కేంద్ర‌మైన త్రిపురాంలో ఓ మొస‌లి పంట పొలాల్లోకి వ‌చ్చింది.

- Advertisement -

రోజువారి వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మైన రైతులు ఒక్క‌సారిగా పంట పొలంలో ఉన్న మొస‌లిని చూసి ఒక్కసారిగా స్తంభించిపోయారు. ఏం జ‌రిగిందో కొద్దిసేపు అర్థం కాక రైతు అలాగే అవాక్క‌య్యాడు. అనంత‌రం తేరుకొని ఒక్క‌సారిగా గ‌ట్టిగా కేక‌లు వేస్తూ పొలాల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశాడు. అక్క‌డ ఉన్నట్టుండి వ్యవసాయ పొలంలో మొసలి కనిపించడంతో రైతులు పొలం పనుల్లోకి వెళ్లాలంటేనే జంకుటున్నారు. ఈ క్రమంలో మొసలిని చూసేందుకు గ్రామం నుంచే కాకుండా పక్క గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement