Friday, May 17, 2024

Hyderabad: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లు.. గ్యాంగ్‌ని అరెస్టు చేసిన పోలీసులు

దిల్‌సుఖ్‌నగర్, (ప్రభ న్యూస్): హైద‌రాబాద్‌లో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్న గ్యాంగ్‌ని పోలీసులు ప‌ట్టుకున్నారు. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధి భగత్ సింగ్ నగర్ లో భారత్ vs శ్రీలంక T20 ఆసియా క్రికెట్ కప్ సందర్భంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను సరూర్ నగర్ పోలీసుల తో కలసి, ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు ప‌ట్టుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నిర్వాహకులు తన్నీరు అశోక్ , మేడిశెట్టి కిషోర్ ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 9,63,476 రూపాయల నగదు , ఐదు మొబైల్ ఫోన్స్ , ఒక మారుతి కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీటి విలువ మొత్తం దాదాపు 20.15ల‌క్ష‌ల దాకా ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన బుకీ గుంగి సుబ్బారావు, మహమ్మద్ ఖాదిర్ పరార్ లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement