Friday, May 3, 2024

TS | క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు ఫీక్ చేరుతున్నట్టే, ఐపీఎల్ బెట్టింగ్స్ జోరు కూడా పెరిగింది. టీవీల ముందు కూర్చొని వేలాది రూపాయలను బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్స్ కాస్తూ క్రికెట్ మ్యాచ్ ల హోరు పెంచుతున్నారు. సరిగ్గా ఇదే అవకాశాన్ని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అవకాశంగా తీసుకొని క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల గుట్టు బట్టబయలు చేశారు. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ చౌరస్తాలో గుట్టుచప్పుడు కాకుండా డఫాబెట్ యాప్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్స్ కాస్తున్న చీకటి దందాను వెలుగులోకి తీసుకొచ్చారు.

వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీనివాసరావు నేతృత్వంలో సోమవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేశారు. అలాగే 80 వేల రూపాయల నగదు, 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఫోర్ట్ కు చెందిన చింతం సాయి కుమార్ (26), చింతం కపిల్ (33, శంభునిపేటకు చెందిన స్టూడెంట్ పస్తం వినోద్ కుమార్ (28), రంగశాయిపేటకు చెందిన గట్టు దర్శనం (26) ని అరెస్ట్ చేశారు. తదుపరి చర్యల కోసం ఇంతేజార్ గంజ్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement