Friday, May 17, 2024

Breaking: బండి సంజ‌య్‌కి కోర్టు మొట్టికాయ‌లు.. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు వ‌ద్ద‌ని హిత‌వు

ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ మంత్రి, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న బండి సంజ‌య్‌కి హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్టు మొట్టికాయ‌లు వేసింది. ఇంట‌ర్ స్టూడెంట్స్ మ‌ర‌ణానికి మంత్రి కేటీఆర్ కార‌ణ‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌లు సంద‌ర్భాల్లో ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై మంత్రి త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా వ్యాఖ్య‌లు చేశార‌ని, బండి సంజ‌య్‌పై కేటీఆర్ ప‌రువున‌ష్టం దావావేశారు. అంతే కాకుండా ఆ పిటిష‌న్‌లో బండి సంజ‌య్ త‌న‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పేలా కోర్టు ఆదేశించాల‌ని కోరారు. కాగా కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావాపై కోర్టు మ‌ద్యంత‌ర ఉత్త‌ర్వులిచ్చింది. కేటీఆర్‌కు ప‌రువుకు న‌ష్టం క‌లిగేలా వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని ఆదేశాలు జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement