Friday, April 26, 2024

TS : జ‌న‌గామ జిల్లాలో దంప‌తుల ఆత్మ‌హ‌త్య…

జ‌న‌గామ జిల్లాలో దంప‌తులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుని భార్యభర్తలు ఆత్మహ‌త్య చేసుకున్నారు. ఈ ఘటన జ‌న‌గామ‌లో ఇవాళ చోటుచేసుకుంది.

పట్టణ పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన సెల్వరాజ్, భాగ్యలక్ష్మి భార్యభర్తలు. వారు జీవనోపాధి కోసం చెన్నై నుంచి జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీకి వలస వచ్చారు. కాగా, కొన్నాళ్ల నుంచి వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనంతరం కాలిన గాయాలతో సెల్వరాజ్, భాగ్యలక్ష్మి దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement