Thursday, May 2, 2024

ఘనంగా బోనాల ఉత్సవాలు… కార్పొరేటర్ దొంతిరి దంపతుల ప్రత్యేక పూజలు…

మేడిపల్లి,జూలై 17(ప్రభన్యూస్) తెలంగాణ సంప్రదాయ పండుగలో ఒకటైన బోనాల పండుగను పీర్జాదిగూడ కార్పొరేషన్ 25వ డివిజన్ లోని క్రాంతికాలనీ పోచమ్మ,అంకాలమ్మ అమ్మవారి దేవాలయంను స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శించుకోని బోనం, నైవేద్యం, ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం పోచమ్మ గుడి నిర్మాణ దాత,మాజీ సర్పంచ్ కుతాడి నర్సింహను కార్పొరేటర్ దొంతిరి శాలువతో సన్మానించారు. అదేవిధంగా కార్పొరేటర్ దంపతులను క్రాంతి కాలనీ వాసులు శాలువతో సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement