Sunday, May 5, 2024

ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు అధికారులు చాలామంది క‌రోనా బారిన పడ్డారు. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కరోనా స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. దీంతో కొవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది.

క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఎమ్మెల్యే దాసరి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారు లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంద‌ని, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి జాగ్రత్తలు పాటించాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement