Saturday, April 20, 2024

బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కరోనా కలకలం రేపింది. ఆర్జీవి కేటీకి సంబంధించిన ఫ్యాకల్టీ సిబ్బందికి చెందిన ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కళాశాల ఆసుపత్రిలో కాకుండా బాసర ప్రభుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకున్నారు. ఫ్యాకల్టీ సిబ్బందితో ఇతర విద్యార్థులకు కరోనా సోకుతుందోనన్న భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా కళాశాల అధికారులు లోలోపల చికిత్స చేయించి పంపించారు. ప్రస్తుతం వారు లక్షణాలతో కోర్సు మొదలు పెట్టారు. ప్రస్తుతం పరిస్థితి మామూలుగానే ఉంది. ఈ సందర్భంగా వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెసర్ వెంకటరమణ పరిస్థితులను తెలుసుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంబంధిత వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement