Friday, May 3, 2024

HYD: ఏబీవీపీ ఝాన్సీ ఘటనలో.. కానిస్టేబుల్ అయేషా సస్పెండ్

రాజేంద్రనగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గ‌త‌ రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

వివరాలిలా ఉన్నాయి…. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 55 జారీచేసింది. జీవో రద్దు చేయాలని ఇటీవల రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి పారిపోయేందుకు పరుగు తీసింది. ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై వెళ్లారు.

అయేషా అనే కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించింది. స్కూటీ వెనకాల కూర్చొన్న ఆమె ఝాన్సీ జట్టు పట్టుకొని లాగింది. దీంతో ఝాన్సీ కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాత్ మహంతి స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ అయేషా దురుసుగా ప్రవర్తించిందని విచారణలో తేలింది. దీంతో అయేషాను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement