Tuesday, May 7, 2024

TS : మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌ను క‌లిసిన కాంగ్రెస్ అధికార‌ప్ర‌తినిధి మ‌హేష్‌

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ,పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరింనగర్ జిల్లా ఇంఛార్జి మంత్రిగా నియామకమైన సందర్భంగా హైదరాబాద్‌లోని వారి నివాసంలో, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు.

పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గత 10 ఏళ్లలో అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నందున అన్ని రంగాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు సహకరించాలని మంత్రిని కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని మహేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement