Tuesday, September 17, 2024

కాంగ్రెస్ కు చెయ్యి ఇచ్చి కారు ఎక్కిన ముఖ్య నేతలు

సంగారెడ్డి, సెప్టెంబరు 06 (ప్రభ న్యూస్): కొండాపూర్ మం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రారెడ్డి, సర్పంచ్ అంకుషా ఇంద్రా రెడ్డి, ఏడు మంది వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ ప్రకాశం, ఎద్దుమైలారం మాజీ సర్పంచ్ దశరథ్, మల్కాపూర్ బిజెపి మాజీ ఎంపీటీసీ తమని, ప్రవీణ్, వివిధ యువజన సంఘం నేతలు, వీరితో పాటు ఆరు వందల మంది నేతలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలకు దూరంగా ఉంటూ, నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా, చింతా ప్రభాకర్ నిరంతరం సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నార‌న్నారు.. సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గెలిచిన ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, పార్టీ నాయకులను పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింద‌న్నారు – పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యే సొంత ప్రయోజనాలకే తమ లాంటి యువకులను వాడుకున్నారే. తప్ప మాకు ఎప్పుడు అందుబాటులో లేర‌న్నారు – పార్టీలో చేరిన వారు చింతా ప్రభాకర్ నాయకత్వంలో సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం- పార్టీలో చేరిన వారు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement