Monday, May 6, 2024

TS: కాంగ్రెస్ ఖేల్ ఖతం.. మత పిచ్చి పార్టీ బీజేపీ .. మంత్రి కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పని ఖేల్ ఖతమైందని, బీజేపీ మత పిచ్చి పార్టీ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలియజేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, ఇక తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. యాభై ఐదేళ్లు అధికారం ఇస్తే చేయనోళ్లు మరొక అవకాశం ఇవ్వండి అని అడగడం సిగ్గుచేటన్నారు. వారంటీ లేని పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మరన్నారు.

ఆర్ఎస్ఎస్ మూలాలున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని చేశారని స్వంత పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారన్నారు. బీజేపీ మతపిచ్చి పార్టీ అని అన్నారు. బీజేపీ పాలనలో రూ.400లు ఉన్న సిలిండర్ 1200 రూపాయలకు పెరిగిందని, 70 రూపాయలున్న పెట్రోల్ రూ.110 కి చేరిందన్నారు. బీడీ కార్మికులకు పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement