Saturday, May 4, 2024

Delhi: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

ఢిల్లీ : ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీఈసీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మధు యాష్కీ హాజరయ్యారు.

ఈ సమావేశంలో భాగంగా స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సీఈసీ పరిశీలించనుంది. అనంతరం అభ్యర్థుల తొలి జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 15 తరువాత ఏఐసీసీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement