Saturday, May 4, 2024

Congress Campaign – కెసిఅర్ దోచుకున్న సొమ్ము కక్కిస్తాం – పేదలకు పెంచుతాం : రాహూల్ గాంధీ

సంగారెడ్డి / ఆంథోల్‌ – కేసీఆర్‌జీ నువ్వు కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశావో చెప్పు. మీరు తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ చేశావని కాంగ్రెస్ ఆరోపిస్తోంది’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంథోల్‌, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ,ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములు గుంజుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న రాహుల్‌.. కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోకి బీజేపీ చూస్తూ ఊరుకుంటోందన్నారు రాహుల్ గాంధీ. కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే మోదీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనన్నారు. లోక్‌సభలో మోదీకి బీఆర్‌ఎస్‌, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ మద్దతిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ తనపై 24కేసులు పెట్టారన్న రాహుల్.. అవినీతిపరుడైన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారని విమర్శించారు

అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. కాంగ్రెస్‌ను ఓడించడానికే బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఓడగొట్టేందుకే బలం లేకపోయినా ఎంఐఎం పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొరల ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి’ అని రాహుల్‌ మండిపడ్డారు

‘కాంగ్రెస్‌ వచ్చాక ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. . కేసీఆర్‌ ఎంత అవినీతి చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది. నా ఇల్లును లాగేసుకున్నా భారత దేశమే నా ఇల్లు అనుకున్నా. కేసీఆర్‌ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు’ అని రాహుల్‌ విమర్శించారు

దొరల సర్కార్‌కు ప్రజల సర్కార్‌కు మధ్య పోటీ జరుగుతోంది. కేసీఆర్‌ చదువుకున్న స్కూల్‌ కాంగ్రెస్‌ కట్టించిందే. ప్రపంచంలోనే ప్రసిద్ది గాంచిన హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేసింది. . నిన్న రాత్రి తెలంగాణ యువకులతో కలిసి మాట్లాడా. నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకు రావడం లేదు. ప్రశ్నపత్రాలు ఎందుకు లీకవుతున్నాయి. కేసీఆర్‌ దోచుకున్న డబ్బులు ప్రజల బ్యాంక్ ఖాతాల్లోకి పంపిస్తాం. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం. చాతి ముందుకు పెట్టుకుని తిరిగే వారి, కారు టైర్‌లో గాలి తీసేది కాంగ్రెస్‌ పార్టీయే’ అని రాహుల్‌ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement