Sunday, May 19, 2024

MBNR: కాంగ్రెస్ ఫ్లెక్సీల కలకలం.. పాత, కొత్త నేతల మధ్య రచ్చకెక్కిన విభేదాలు

జోగులాంబ గద్వాల (ప్రతినిధి), ఆగస్టు 31 (ప్రభ న్యూస్) : జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరులో ఫ్లెక్సీల కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ పాత, కొత్త నేతల మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యను ఉద్దేశించి గద్వాల్ లో ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. గద్వాల ఆత్మగౌరవము కావాలా – అల్లంపూర్ అరాచకము కావాలా,
అల్లంపూర్ వలస నేతల పెత్తనాన్ని సహిద్దామా – గద్వాల ఆత్మ గౌరవాన్ని చాటుదామా… గద్వాల ఆత్మగౌరవాన్ని అమ్ముకుందామా – మనలో ఒకరిని ఎన్నుకుందాం అంటూ గద్వాల్ లోని ప్రధాన రహదారుల్లో రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ వారే జడ్పీ చైర్ పర్సన్ సరితను ఉద్దేశించి ఫ్లెక్సీలు పెట్టడంపై గద్వాల జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

గద్వాల్ జిల్లాలో గత రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఫ్లెక్సీలను జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య వర్గీయులు చింపివేశారని వీరిపై గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ కు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే మరలా జడ్పీ చైర్ పర్సన్ పై ఇలాంటి ఫ్లెక్సీలు రావడం జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement