Tuesday, July 23, 2024

KCR: విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వండి.. కేసీఆర్‌కు జ‌స్టిస్ న‌ర్సింహారెడ్డి నోటీసులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో నోటీసులు అందాయి. జస్టిస్ నర్సింహా రెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈనెల 30లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జులై 30వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ద్రుష్టి సారించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement