Saturday, May 4, 2024

Cyber: సీవీ ఆనంద్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్…

సైబ‌ర్ నేర‌గాళ్లు తెలివిగా కొత్త పుంత‌లు తొక్కుతున్నారు. ఎలాంటి అవ‌కాశం వ‌చ్చిన సొమ్మును దోచేస్తున్నారు. మ‌న ప్ర‌మేయం లేకుండానే మ‌న పేరుతో ఖాతాల‌ను ఖాళీ చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ సీనియ‌ర్ పోలీస్ అధికారి పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు సోష‌ల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డ‌బ్బులు దండుకుంటున్నారు.

సీవీ ఆనంద్ పేరుతో డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనుచిత సందేశాలు కూడా పంపుతున్నారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సీవీ ఆనంద్ పేరు మీద ఉన్న ఖాతా నిజమేనని నమ్మి కొందరు సైబర్ నేరగాళ్లు డబ్బులు పంపుతున్నారు. మరికొందరు ఆ ఖాతా నుంచి వచ్చిన మెసేజ్‌లను చూసి షాక్‌కు గురవుతున్నారు. సీవీ ఆనంద్ లాంటి వ్యక్తి ఇలాంటి మెసేజ్‌లు ఎందుకు పంపగలడని ఆశ్చర్యం కలుగుతుంది.

సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న సీవీ ఆనంద్ పేరును చెడగొట్టేందుకు సైబర్ దుండగులు అతడి పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాను సృష్టించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ చిరునామాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అవి నకిలీవని తేలితే వెంటనే ఫిర్యాదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. తమ ట్రస్ట్ ఖాతాలను ఖాళీ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement