Monday, April 29, 2024

CM KCR : ఇవాళ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీఎం కేసీఆర్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లు

గులాబీ బాస్‌ ప్రచారంలో జోరును కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించ‌నున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోని మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు.

కాగా మధ్యాహ్నం సుల్తాన్‌పూర్ వేదికగా నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఎం హాజరవుతున్న ఈ సభకు నియోజకవర్గం నుంచి జనాన్ని పెద్ద సంఖ్యలో ఇప్ప‌టికే త‌ర‌లించారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో భారీ వేదికతో పాటు మహిళలు, ముఖ్య కార్యకర్తల కోసం పది వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీశైలం జాతీయ రహదారితో పాటు ఆర్సీ ఐ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయ నున్నారు. కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ నుంచి వచ్చే వాహనాలను హౌసింగ్‌బోర్డు సమీపంలో నిలిపివేయనున్నారు. ఆర్కేపురం, సరూర్నగర్, బడంగ్పేట్, మీర్పేట్ నుంచి వచ్చే వాహనాలను మల్లాపూర్ సమీపంలోనే నిలిపివేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement