Friday, May 3, 2024

CM KCR : వేముల మంజులమ్మ భౌతిక కాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులు

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల మాతృమూర్తి మంజులమ్మ (77) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఇవాళ‌ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి మంజులమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నివాళులర్పించారు.

నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులోని మంత్రి నివాసానికి వెళ్లి మంజులమ్మ భౌతిక కాయానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి వేములను, ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వెంట స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement