Tuesday, July 23, 2024

TS | స్టేట్‌ సబార్డినెన్స్‌ నిబంధనల్లో మార్పులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఇటివల హైకోర్ట్‌ ఇచ్చిన మహిళల సమాంతర రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఈ మేరకు 1996లో పేర్కొన్న రూల్స్‌ 22లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ అనుమతితో మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుండి అన్ని రకాల ఉద్యోగాలకి మహిళా సమాంతర రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. గతంలో ఉన్న మహిళ వర్టికల్‌ రిజర్వేషన్లు తొలగించి ఇక నుండి అన్ని రకాల జనరల్‌ కేటగిరిలో మాత్రమే 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement