Monday, June 17, 2024

TS : ప్రభుత్వ పాఠశాల సమయాల్లో మార్పులు..

వేస‌వి సెల‌వులు ముగుస్తున్న త‌రుణంలో విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల సమయాల్లో మార్పు పై నిర్ణ‌యం తీసుకుంది. జూన్ 12తో వేస‌వి సెల‌వులు ముగియ‌నుండ‌డం, పాఠ‌శాలలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స‌మ‌యాలను మారుస్తున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది.

- Advertisement -

ఇదివ‌ర‌కు పాఠ‌శాల‌లు ఉద‌యం 9ః30కి తెరుచుకొని సాయంత్రం 4ః30కి మూసేవారు. కానీ తాజాగా ఉద‌యం 9గంట‌ల నుంచి సాయంత్రం 4ః45గంట‌ల‌వ‌ర‌కు పాఠ‌శాల‌ను న‌డిపేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు పాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాల పని వేళల్లో మార్పులకు ఆమోదం తెలిపినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

విద్యార్థులు ఉదయం 9.30 కి స్కూలుకు వెళ్లడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతోందనే విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను నడపాలని అధికారులు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. ఈ క్రమంలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 2024 – 2025 విద్యా సంవత్సరం నుంచి ఉదయం 9.00 గంటలకే ప్రారంభించాలనే ప్రతిపాదనకు ఆయన ఆమోదం కూడా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement