Monday, April 29, 2024

HYD: ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. అనంతరం వారి సూచన మేరకు ఇవాళ చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement