Saturday, May 18, 2024

Floods: తెలంగాణకు సెంట్రల్​ టీమ్​.. వరద నష్టాలను అంచనా వేసేందుకు రాక!

తెలంగాణలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ తెలంగాణలో పర్యటించనుంది. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి జనరల్ సెక్రటరీ తరుణ్ చుగ్‌తో కలిసి అమిత్ షాను కలిసి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని ఆయన కోరారు.

భారీ వర్షాలు, గోదావరి నదిలో వరదల కారణంగా జరిగిన విధ్వంసాన్ని బండి సంజయ్ హోంమంత్రికి వివరించారు. పార్లమెంటు సభ్యుడు కూడా అయిన సంజయ్ మాట్లాడుతూ.. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి, నివేదికను సమర్పించడానికి తెలంగాణకు ఒక బృందాన్ని పంపాలని అమిత్ షా సంబంధిత అధికారులను ఆదేశించారు. పొలాలు, ఇళ్లు, ప్రజలు.. ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని ఓపికగా విన్నందుకు, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన విధ్వంసం గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినందుకు షాకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. జాతీయ రహదారి-65లోని పూణె-హైదరాబాద్ సెక్షన్‌లోని బీహెచ్‌ఈఎల్ జంక్షన్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.130.65 కోట్లు మంజూరు చేసినందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి బండి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనేక ఫ్లైఓవర్లలో ఇదొకటి అని ట్వీట్ చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement