Friday, May 3, 2024

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు ప్ర‌ముఖుల నివాళులు

ఇవాళ మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు 17వ వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా పీవీ న‌ర‌సింహారావుకు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. న‌గ‌రంలోని నెక్లెస్ రోడ్డులో పీవీ జ్ఞాన‌భూమి వ‌ద్ద గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, అలాగే పీవీ స‌మాధి వ‌ద్ద మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌హ‌ముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుర‌భి వాణీదేవీతో పాటు పీవీ కుటుంబ స‌భ్యులు, ప‌లువురు నాయ‌కులు నివాళుల‌ర్పించారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ… తెలంగాణ ప్ర‌భుత్వం పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించింద‌న్నారు. దేశంలో పీవీ ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేశార‌ని గుర్తు చేశారు. పీవీ దేశానికి అందించిన సేవ‌ల‌ను ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచిపోరని చెప్పారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ… పీవీ న‌ర‌సింహారావు దేశంలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చార‌ని గుర్తు చేశారు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి పీవీ న‌ర‌సింహారావు అని, కానీ కేంద్రం తెలుగువారిని ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. తెలుగువారంటే కేంద్రంలో గౌర‌వం లేద‌ని మంత్రి త‌ల‌సాని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement