Sunday, April 28, 2024

Case File: మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం, మాజీ డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సీయుద్దీన్ ల‌పై కేసు న‌మోదు

హైదరాబాద్: కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సహా మరో ఆరుగురిపై కేసు నమోదైంది. కాగా, బాబా ఫసీయుద్దీన్ దాడి చేశారని నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేష్‌ పేర్కొన్నాడు. దీంతో నిందితులపై పలు సెక్షన్ల కింద కోస్గి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రెండు రోజుల నుంచి కోస్గి, బోరబండ పోలీసులు ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్ ల‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement