హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ను ప్రేరణగా తీసుకుని ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ కార్టూన్లు (ట్రీ టూన్స్-హరితహాసం)ను గీశారు పర్యావరణం, ప్రకృతిపై అవగాహన కల్పించేలా చిత్రించిన కార్టూన్ల కలెక్షన్ ‘హరితహాసం’ను సీఎం కేసీఆర్ ఈ రోజు విడుదల చేశారు ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు..
పర్యావరణ పరిరక్షణ, హరితవనాన్ని పెంచే లక్ష్యంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ను ఎంపీ సంతోష్ ప్రారంభించారు. . గ్రీన్ ఇండియా చాలెంజ్కు ఐదేళ్లు నిండిన సందర్భంగా హరితహాసంను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ,. మొక్కుల నాటడంపై అవగాహన పెంచేలా 300 కార్టూన్ల కలెక్షన్ ఇది అని అన్నారు. కార్టూనిస్ట్ మృత్యుంజయ పై సీఎం ప్రశంసలు కురిపించారు. అలాగే హరిత తెలంగాణ చిత్రాన్ని సీఎం కేసీఆర్కు మృత్యుంజయ బహూకరించారు
ఎంపీ సంతోష్ కుమార్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపక సభ్యులు కరుణాకర్, రాఘవ, తదిరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ..