Monday, April 29, 2024

TS : ఓఆర్ఆర్ పై కారు బోల్తా… ఒకరు మృతి…

ఔటర్ రింగ్ రోడ్డుపై వరుసగా రోడ్డు ప్రమాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత‌ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన ఘ‌ట‌న మ‌రువాక ముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా కొట్టి ఒక‌రు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది.

రామేశ్వరం బండ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది.
ఈ తరుణంలోనే ఒకరు మృతి చెందారు. అటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ నుంచి పటాన్ చెరు వస్తుండగా డివైడర్ ఎక్కి అవతలి వైపు కారు పడింది. ఈ ప్రమాద సమయంలో అవతలి వైపు నుంచి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement