Saturday, April 27, 2024

AP: వైసీపీకి షాక్‌… మాగుంట రాజీనామా…

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి వైసీపీకి రాజీమానా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నా..త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్నీ విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోందని…మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారని వెల్లడించారు.

- Advertisement -

మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం..మాకు ఇగోలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది..మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నామని చెప్పారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement