Wednesday, April 24, 2024

రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్దం

మునగాల, ప్రభ న్యూస్: మండల పరిధిలోని ఇందిరానగర్ గ్రామ శివారులో 65 నెంబర్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని బస్ ఢీకొని బస్సు పూర్తిగా దగ్ధమై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి 13మంది ప్రయాణికులతో విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు ఇందిరా నగర్ గ్రామ శివారుకు వచ్చే సరికి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న మురుగేషన్ రాజు(45) పక్కకు పడిపోగా ద్విచక్ర వాహనం బస్ కిందికి పోవడంతో అది గమనించని బస్సు డ్రైవర్ సుమారు 300 మీటర్లు రావడంతో ద్విచక్ర వాహనంలో ఉన్న పెట్రోల్ కు మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. క్రిందపడి తీవ్ర గాయాలైన రాజును చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు ఎస్సై లోకేష్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement